Sunday, May 5, 2024

Nandyala : మేడ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కస్తురిబా గురుకుల పాఠశాలలో దీపిక (17) అనే విద్యార్థిని మేడ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటర్ రెండో సంవత్సరం బైపిసి చదువుతున్న దీపిక అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంగా తెలిసింది. దీపికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement