Sunday, May 5, 2024

SKLM: వంశధార కాలువపై కుప్పకూలిన కల్వర్టు వంతెన.. గ్రామాలకు నిలిచిన రాకపోకలు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం శ్రీజగన్నాధపురం గ్రామం వద్ద వంశధార కాలువపై ఉన్న కల్వర్టు వంతెన కుప్పకూలింది. ఇవాళ ఎవరూ లేని సమయంలో వంతెన కూలిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
ఈ వంతెన కూలడంతో శ్రీ జగన్నాధపురం గ్రామం నుంచి ఎస్ బి కొత్తూరు, ఉప్పాడ పేట, ఆర్ హెచ్ పురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిధిల వంతెనకు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ షాక్ తో లైన్ మెన్ కు తీవ్రగాయాలు..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో శనివారం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కింతని రామ్మోహనరావు అనే లైన్ మెన్ కు విద్యుత్ షాక్ తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement