Sunday, April 28, 2024

SKLM: కన్యకా పరమేశ్వరి ఆలయంలో చోరీ

ఆమదాలవలస, డిసెంబర్ 15 : ఆముదాలవలస పట్టణంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇవాళ తెల్లవారుజామున దొంగలు పడ్డారు. సుమారు 6కేజీల పైన వెండి, రెండు తులాల బంగారం, హుండీలోని రూ.50 వేలకు పైగా నగదు అపహరించారు. పోలీస్ క్లూస్ టీం పరిశీలిస్తుంది.

ఆముదాలవలస పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లో సుమారు 6కు పైగా దేవాలయాలు, పట్టణ ప్రధాన రహదారిలో ఉన్న నాలుగు షాపులు, నాలుగైదు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. దీనిపై ఒక్క కేసును కూడా పోలీసులు చేధించకపోవడంతో, పోలీసుల నిఘా లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement