Saturday, April 27, 2024

భాడీ బిల్డింగ్ విజేతలకు శాసన సభాపతి అభినందనలు

శ్రీకాకుళం, :ఈ నెల 28 వ తారీఖున కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన మిస్టర్ ఆంధ్రా భాడీ బిల్డింగ్ ఛాంపియన్ ఛీప్ పోటీలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు వివిధ కేటగిరిలో పధకాలు సాధించారు. సాధించిన యువకులు వి. విజయ కుమార్, 70 కిలోల కేటగిరిలో తృతీయ స్థానంలో చింతాడ వెంకట్ 80 కిలోల కేటగిరి, 75 కిలోల కేటగిరిలో వి. అబ్రహం లను బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ముఖ ద్వారం ఎదురుగా సభాపతి అభినందిస్తూ యువత చదువుతో పాటు పలు రకాల క్రీడలలో నైపుణ్యం పెంపొందించుకొని విజేతలుగా నిలచి భవిష్యత్తులో మరిన్నీ పధకాలు సాదించి, మన జిల్లాకి మరియు రాష్ట్రానికి మంచి పేరు ప్రత్యకతలు తీసుకొస్తారని ఆశిస్తూ క్రీడల్లో పాల్గొనే యువతి యువకులకు ప్రభుత్వం తరుపున సహాయ సహాకారాలు అందజేస్తానని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement