Friday, May 3, 2024

లింగోజిగూడా డివిజన్ ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న టి ఆర్ ఎస్ …

లింగోజి గూడ – రాబోయే లింగోజిగూడా డివిజన్ ఉప‌ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడు వల్లే పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. లింగోజిగూడా డివిజన్ తెరాస పార్టీ అభ్యర్థి ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జ‌రిగిన‌ డివిజన్ పరిధిలోని తెరాస పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,పలు కమిటీ సభ్యులు,మహిళా క‌మిటీల స‌మావేశంలో దేవిరెడ్డి మాట్లాడూతూ, .ప్రతి ఒక్కరూ దాదాపు మూడు సార్లు ఓటరు గడప,గడపకు తిరిగి తెరాస పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలపాలని అన్నారు. గత సంవత్సరంలో కరోన మరియు భారీ వర్షాల కారణంగా అభివృద్ధిలో కొంతమేర జాప్యం జరిగింది అని తెలిపారు.అలాగే గత 5 సంవత్సరాలుగా ఇట్టి డివిజన్ పరిధిలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది అని తెలిపారు.రాబోయే రోజుల్లో లింగోజిగూడా డివిజను ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ముద్రబోయిన శ్రీనివాసరావు గెలిపించే బాధ్యత అంద‌రి మీద ఉందని సుధీర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తిలక్ రావు,నర్రె శ్రీనివాస్,ఆడాల రమేష్,ప్రేంనాధ్ గౌడ్,భాస్కర్ గంగపుత్ర,వరప్రసాద్ రెడ్డి,జగన్నాథ్ రెడ్డి,నరసింహ గుప్తా,శ్రావణ్ కుమార్,మధు సాగర్, ప్రవీణ్ రెడ్డి,రాజు గౌడ్,ఇంద్రాజీ,దుర్గలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement