Wednesday, May 1, 2024

పిడుగుపాటుతో వ్యక్తి దుర్మరణం

ఇచ్ఛాపురం : మున్సిపాలిటీలోని పురుషోత్తపురం గ్రామంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఆ గ్రామానికి చెందిన సున్నాముద్ది సుందరరావు (62) మూత్ర విసర్జన కోసం పెరటికి వెళ్లగా ఆ సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య నందిత, వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతుడు అదే గ్రామంలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement