Tuesday, April 30, 2024

స్పీకర్ తో గంటా భేటి…రాజీనామా ఆమోదించాల‌ని విన‌తి

అముదాల‌వ‌ల‌స – టిడిపి నేత‌, మాజీ మంత్రి, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌ర‌రావు శాస‌నస‌భ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం భేటి అయ్యారు… అముదాల‌వ‌ల‌స‌లోని స్పీక‌ర్ ఇంటికి నేటి ఉద‌యం చేరుకున్న గంటా గంట‌కు పైగా ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. ఇటీవ‌ల తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి చేసిన రాజీనామాను ఆమోదించ‌వ‌ల‌సిందిగా స్పీకర్ ను అభ్య‌ర్ధించారు.. అమ‌రావ‌తి వెళ్లిన వెంట‌నే రాజీనామాపై ఒక నిర్ణ‌యం తీసుకుంటాన‌ని త‌మ్మినేని హామీ ఇచ్చారు.. స్పీక‌ర్ ను క‌లిసిన అనంత‌రం గంటా మీడియాతో మాట్లాడుతూ, త‌న రాజీనామా ఆమోదించే విష‌యంలో చ‌ర్చించేందుకే గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన‌ట్లు పేర్కొన్నారు.. కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమంలో గంటా చురుగ్గా పాల్గొంటున్నారు.. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ స్పీక‌ర్ కు లేఖ పంపారు.. అలాగే వివిధ పార్టీల‌కు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి విశాఖ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలోకి రావాల‌ని గంటా పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement