Thursday, April 25, 2024

జన సైనికుల ఆర్ధిక సాయం

ఇచ్ఛాపురం : మండలం లోని లొద్దపుట్టి గ్రామపంచాయతీకి చెందిన నీలాద్రిపేట తిప్పన కృష్ణ కూర్మమ్మ దంపతుల కుమారుడు కామరాజు తన గ్రామంలో ఉపాధి లేక కుటుంబ పోషనార్ధం హైదరాబాద్ నగరంలో పనికి వెల్లి రోడ్డు ప్రమాదంలో మార్చ్ 25వ తారీఖున మృతిచెందారు. ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని జనసేన సర్పంచ్ అభ్యర్థి బడియా జోగారావు లొద్దపుట్టి జనసేన సేవా సమితి తరపున 10,000 ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు , తిప్పన దుర్యోధన , భాస్కర్ అలాగే లొద్దపుట్టి జనసైనికులు సాడి నగేష్, జోగారావు, తిప్పన సురేష్ సంతోష్, వాసు, చంటి, గణేష్, మోహన్, బానుప్రసాద్, మాధవరావు ,తారకేసు మరియు కాలనీ యువత పాల్గొన్నారు. ఇల్లు లేని వారి కోసం ప్రభుత్వం అందించే ఇల్లును మంజూరు చేయవలసిందిగా ఆ కాలనీ యువత ప్రార్ధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement