Friday, March 29, 2024

ఉప్పెన దర్శకుడి రెమ్యూనరేషన్ నిజమేనా ? మరీ 8 కోట్లా !!

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అటు హీరోకి ఇటు దర్శకుడికి హీరోయిన్ కి ఈ సినిమా మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమా విజయంతో వైష్ణవ్ తేజ్ ,కృతి శెట్టి రెమ్యూనరేషన్లు పెంచేశారు. ఇక ఇప్పటికే అటు వైష్ణవ్ ఇటు కృతి ఇద్దరూ వారి వారి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

కానీ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం తన తర్వాతి సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన బుచ్చిబాబు తన తర్వాతి సినిమా ను ఎన్టీఆర్ తోనే అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కథ కూడా తయారు చేశాడట. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే రెమ్యునరేషన్ పరంగా మాత్రం ఎనిమిది కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట బుచ్చిబాబు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియడం లేదు..కానీ ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎనిమిది కోట్లు అడగడంలో తప్పులేదని అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement