Sunday, April 28, 2024

SKLM: వ్యయ పరిశీలన పారదర్శకంగా ఉండాలి… ఎన్నికల పరిశీలకులు

శ్రీకాకుళం, ఏప్రిల్ 19 (ప్రభ న్యూస్) : ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్ లు సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అధికారులు మాట్లాడారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిఘా కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని చెప్పారు. నిఘా బృందాలకు సీసీ కెమెరాలు, జీపీఎస్‌ ట్యాగ్‌ సిస్టం అమర్చిన విధానాన్ని అడిగారు.

సీ-విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రచార ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిశీలన బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, నోడల్ అధికారులు సీపీఓ ప్రసన్న లక్ష్మి, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్న కేశవరావు, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డీసీసీబీ సీఈవో వరప్రసాద్, నీటిపారుదల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్, తదితర అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement