Tuesday, April 30, 2024

AP: సీఎం జగన్ బలం, బలగం రాష్ట్ర ప్రజలే.. ధ‌ర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం, మార్చి 13 (ప్ర‌భ న్యూస్) : సిఎం వైఎస్ జగన్ బలం, బలగం ఈ రాష్ట్ర ప్రజలేనన్న వాస్తవం విపక్షాలకు ఇప్పటికే అర్ధమై ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని వైసిపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసారు.

ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ… స్వార్ధరాజకీయాలకోసం పొత్తులు పెట్టుకున్న విపక్షాలు ఇప్పటికీ ఎక్కడ ఎవరిని పోటీకి దింపాలో కూడా తేల్చుకోలేకపోతుండడం వారి బలహీనతకు సంకేతంగా తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలకు కుటుంబాలవారీగా ఎవరికి ఎంత సంక్షేమం అందిందో సీఎం జగన్ లేఖలతో స్పష్టం చేస్తున్నారని, అలా చెప్పగలిగే దైర్యం, దమ్మూ ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై కక్షతో, ఎలాగైనా అధికారంలోకి రావాలనే దాహంతో చంద్రబాబు బీజేపీతో పొత్తుకు కాళ్లావేళ్లాపడ్డారన్నారు.

ఈ కార్యక్రమాల్లో యువనేత ధర్మాన రామమనోహర్ నాయుడు, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, గొండు రఘురాం, చల్లా అలివేలుమంగ, అందవరపు ప్రసాద్, అందవరపు రమేష్, సాదు వైకుంఠం, రఫీ, పీసా గోపి, పి సుగుణ రెడ్డి, పొన్నాడ రుషి, డాక్టర్ శ్రీనివాస పట్నాయక్, సిజ్జు, మార్పు పృథ్వి, గంగు శారద, నల్లి ఆశా దీపిక, గుంట జ్యోతి, రత్నాల నరసింహమూర్తి, మహమ్మద్ బేగ్, తేజ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement