Wednesday, May 15, 2024

AP | 50ఏళ్ల కూతురు చితికి తలకొరివి పెట్టిన 80ఏళ్ల తల్లి..

సోంపేట, (ప్రభ న్యూస్) : తనకు వివాహం జరిగి నెల రోజులకే భర్త విడిచి పెట్టటంతో శ్రీకాకుళం జిల్లాలో కూలినాలి చేసుకుంటూ పదేళ్ల క్రితం సోంపేట కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయంలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో భాధ పడుతూ 50ఏళ్ల వయస్సు లో మృతి చెందటంతో 80ఏళ్ల వయసు ఉన్న తల్లి కూతురు చితికి తలకొరిమి పెట్టే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు సోంపేట మండలం తాళ్ళభద్ర గ్రామానికి చెందిన తోట గోపమ్మ (50) సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ రాజం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ పలాసలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెండటం తో తన స్వగ్రామమైన తాళ్ల బద్ద గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 80 ఏళ్ల వయసులో ఉన్న తల్లి కూతురు చితికి తలకొరిమి పెట్టడంతో చూపరులకు లకు కండతడి పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement