Saturday, May 18, 2024

Delhi | బీసీ రిజర్వేషన్లకు సహకరించండి.. కేంద్ర మంత్రి షెకావత్‌కు ఓబీసీ సంఘం వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని ఆలిండియా ఓబీసీ జ్యోతిరావు పూలే అసోసియేషన్ కేంద్ర మంత్రులను కోరింది. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన ఓబీసీ సంఘం అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కులగణనకు అనుకూలంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement