Tuesday, April 30, 2024

నవనీతకృష్ణునిగా శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం  నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు.     ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోస్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7  నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement