Thursday, April 25, 2024

AP | కరెంట్​ షాక్​తో శ్రీచైతన్య స్కూల్​లో విద్యార్థి మృతి.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘ‌ట‌న‌

పెనమలూరు, (ప.గో. జిల్లా) ప్రభ న్యూస్‌ : కానూరు శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో విద్యార్ధి మృతి చెందిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశం పాలెం గ్రామానికి చెందిన మద్దిపాటి కాశీవిశ్వనాథ్‌ కుమారుడు జశ్వంత్‌ శ్రీసాయి (17) విజయవాడ కానూరు శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

తన బట్టలను ఉతుక్కుని తీగపై వేయగా పక్కనే ఐరన్‌ తీగ ఉండటంతో విద్యార్థికి విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే పడిపోయాడు. కళాశాల యాజమాన్యం నెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement