Saturday, May 4, 2024

శ్రీకాకుళంలో దారుణం.. తాగిన మైకంలో తండ్రిపై కత్తితో కొడుకు అటాక్​..

సంతబొమ్మాళి, (ప్రభ న్యూస్​) : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బావనపాడులో గురువారం దారుణం జరిగింది. మద్యం మత్తులో తండ్రిపై కొడుకు కత్తితో దాడిచేశాడు. భావనపాడు గ్రామానికి చెందిన కొయ్యల నారాయణ (66) పై  అతని కుమారుడు పోలయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో తల, ముఖంపై కత్తితో నరకడంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ లో  టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. భార్యను కొట్టి ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి, మద్యం తాగొచ్చి పోలయ్య ఇంట్లో  గొడవ చేస్తున్నాడు. దీనికి తండ్రి అడ్డుపడి అడగడంతో ఆగ్రహించిన పోలయ్య కత్తితో తండ్రిని తీవ్రంగా గాయపరిచాడు. 

దాడికి కుటుంబ కలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు. పోలయ్య గతంలో తనకు తానే బ్లేడ్ తో కోసుకొని గాయాలపాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నౌపడ పోలీసులు పోలయ్యను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టెక్కలి సిఐ గణేష్, సంతబొమ్మాళి ఎస్సై గోవింద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నౌపడ ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement