Saturday, April 27, 2024

భోగి మంటలతో ప్రభుత్వంపై నిరసన తెలిపిన సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై భోగి మంటల ద్వారా నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల ఆలయాలపై, వాటి ఆస్తులపై, హిందువులపై దాడులు జరుగున్నాయని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ రాజమండ్రిలో భోగి మంటల ద్వారా నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement