Tuesday, May 7, 2024

ఆ ఇద్దరూ స్టిక్కర్ సీఎంలు: సోము వీర్రాజు

ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వీరిద్దరూ మాటలతో జనాలను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఏయే అభివృద్ధి పనులు చేశారో జగన్, చంద్రబాబులు చెప్పాలని సోము డిమాండ్ చేశారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే… ప్రస్తుతం సీఎం మాటలతో మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ స్టిక్కర్ సీఎంలని వ్యాఖ్యానించారు.

రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడే ఆయన అభివృద్ది చేసి ఉంటే… అమరావతి రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి వచ్చుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే… వైసీపీ ప్రభుత్వం డబ్బులు మళ్లిస్తోందని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి మోదీ వేసిన డబ్బులను జగన్ లాగేసుకున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement