Friday, April 26, 2024

రాజధాని రైతులకు న్యాయం చేయండి: సోము

అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం సీఆర్డీయే పరిధిలో ఇచ్చిన ప్లాట్లకు పనులు పూర్తి చేసి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వందల రోజులు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలని సూచించారు. రాజధాని రైతులకు సమయపాలనతో కూడిన షెడ్యూల్ ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలన్నారు. రాజధాని రైతుల సమస్య సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని సోము వీర్రాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement