Monday, May 6, 2024

AP | జన్మభూమి ఎక్స్​ప్రెస్​లో పొగలు.. రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు!

లింగంపల్లి నుంచి విశాఖ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో ఇవ్వాల (మంగళవారం) పొగలు వచ్చాయి. మూడు కంపార్ట్ మెంట్లలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మొదట ఓ జనరల్ బోగీలో పొగలు రావడాన్ని ఏలూరు వద్ద గుర్తించారు. దీనిపై అధికారులు స్పందించి రిపేర్లు చేయడంతో పొగ రావడం ఆగిపోయింది. మరో అరగంట తర్వాత రైలు ఏలూరు నుంచి బయల్దేరింది.

అయితే.. తాడేపల్లిగూడెం వద్దకు రైలు చేరుకోగానే మరో రెండు బోగీల్లో పొగ రావడం కనిపించింది. దీంతో ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించగా… జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద నిలిపివేశారు. రైలు ఆగడంతో, పొగలు వచ్చిన బోగీల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా కిందికి దూకి పరుగులు తీశారు. సిబ్బంది కష్టపడి పొగ రాకుండా కట్టడి చేశారు. బ్రేకులు పట్టేయడం వల్లనే పొగలు వచ్చాయని తెలుస్తోంది. కాగా, బోగీల్లో పొగలు రావడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement