Monday, May 13, 2024

Breaking: నీటమునిగి ఆరుగురు విద్యార్థుల గల్లంతు.. ఐదుగురిని కాపాడిన స్థానికులు

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. ఇబ్ర‌హీంపట్నంలోని ఫెర్రీ ఘాట్‌లో ఆరుగురు స్టూడెంట్స్ గ‌ల్లంత‌య్యారు. ఇవ్వాల ఉదయం (శుక్రవారం) ఈ ఘటన జరిగింది. స్నానానికి నీటిలో దిగిన విద్యార్థుల్లో ఆరుగురు నీట మునగగా.. వారిలో అయిదుగురిని స్థానికులు, అక్కడి సిబ్బంది కలిసి కాపాడారు. మరో విద్యార్థి ఆచూకీ దొరకలేదు. ఆ విద్యార్థి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా కొండపల్లి బి కాలనీకి చెందిన వారిగా గుర్తించారు, గల్లంతయిన విద్యార్థి పేరు లోకేష్​గా స్థానికులు తెలిపారు. వీరంతా లోకల్​గా ఉన్న జిల్లా పరిషత్​ పాఠశాలలో చదువుతున్న వారిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement