Thursday, May 2, 2024

Breaking: ఊరు ఊరంతా షాక్​, ఇంట్లో ఏ కరెంట్​ వస్తువు తాకినా అంతే.. నెల్లూరు జిల్లాలో ఘోరం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విద్యుత్​ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ ఊరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాపూరు మండలంలోని కొండకింద గ్రామం అయిన పంగిలి బీసీ కాలనీలో ఏ ఇంట్లో చూసిన కరెంట్​ షాకులు కామన్​ అయ్యాయి. ఇట్లా ఒక్కొక్కరు తమకు మాత్రమే జరుగుతుందేమో అనుకుని గమ్మునుండిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో షాక్​ కొట్టడం ఎక్కవ కావడం, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో ఊరంతా ఈ విషయమే చర్చ జరుగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా పంగిలి బీసీ కాలనీ ఇష్యూ చర్చకు వస్తోంది.

ఇవ్వాల ఉపేంద్ర అనే యువకుడు కరెంట్​ ప్లగ్​ పెడుతుంటే షాక్​ కొట్టింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. కానీ, విద్యుత్​ శాఖ సిబ్బంది మాత్రం తమకు దీంట్లీ ప్రమేయం లేదని, ఎర్త్​ సమస్య వల్లే అట్లా జరుగుతోందని సమస్యనుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఊరు ఊరంతా విద్యుత్​ శాఖ సిబ్బంది, అధికారులపై కోసంతో ఉన్నారు. వాళ్లు కనిపిస్తే చాలు కొట్టాలనంత ఆవేశం గ్రామస్తుల్లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement