Wednesday, May 1, 2024

విద్యార్థులపై లాఠీఛార్జి.. అనంతపురంలో బంద్

అనంతపురంలోని SSBN కళాశాలలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జి నిరసనగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు బంద్ కొనసాగుతోంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ముందస్తుగా పలు కూడళ్లలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల జిల్లా బంద్ నేపథ్యంలో ఈ రోజు పర్యటనను టిడిపి ప్రధాన కార్యదర్శి తన పర్యటన రేపటికి వాయిదా వేసుకున్నారు.

కాగా, అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు రోడ్డెక్కారు. సోమవారం ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement