Wednesday, May 15, 2024

ఏపీలో మరో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టెసి యువ‌తిపై లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. ప్రియుడిని చెట్టుకు కట్టెసి యువ‌తిపై కామాందులు లైంగిక దాడి చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న కృష్ణా జిల్లా బంద‌రు మండ‌లం ప‌ల్లిపాలెం బీచ్ వ‌ద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప‌ల్లి పాలెం గ్రామంలో ఉన్న బీచ్ కు ఓ ప్రేమ జంట స‌ర‌దాగా వెళ్లారు. అయితే అక్క‌డే ఉన్న ఇద్దరు మందు బాబులు.. వీరిని గ‌మ‌నించారు. ప్రేమ జంటపై దాడి చేశారు. అనంత‌రం ప్రియుడిని చెట్టుకు క‌ట్టెసి.. యువ‌తిని అత్యాచారం చేశారు. జరిగిన ఘోరంపై ప్రేమికులిద్దరూ బందరు రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రధాన నిందితుడు నాగబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement