Sunday, April 28, 2024

India Corona: దేశంలో కొత్తగా 4194 కరోనా కేసులు..

ఇండియాలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుతోంది. రోజు రోజుకి కేసల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,194 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 255 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,15,714కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6208 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,84,261 కు చేరింది. ఇందులో 4,24,26,328 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం  42,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98. 99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,72,00,515 కరోనా వ్యాక్సిన్లు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement