Sunday, April 28, 2024

Delhi: ఏపీ స‌ర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ: విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

2003 సెప్టెంబర్‌ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉపయోగించకూడదని ఆదేశించింది. రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు అప్పటి ప్రభుత్వం 35ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement