Sunday, April 28, 2024

ఏపీలో రెండో విడత పురపోరు.. 23న నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఈఏడాది మార్చి 10వ తేదీన రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తిచేసిన ఎన్నికల సంఘం కోర్టు కేసులు, ఇతర సమస్యల మూలంగా నిలిపివేసిన నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు మరో 12 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 19న ముసాయిదా నోటిఫికేషన్‌ పూర్తిచేసి 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు మరో 12 పురపాలక సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. వీటికి సంబంధించి పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ఈనెల 19న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి అభ్యం తరాలను స్వీకరించాలని సూచించి ఈనెల 23న తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

కోర్టు కేసులు, ఇత రత్రా అభ్యం తరాలు లేని నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు బుచ్చి రెడ్డిపాలెం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, కృష్ణా జిల్లా లోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుం టూరు జిల్లాలోని గురజాల, దాచేపల్లి, ప్రకాశం జిల్లాలోని దర్శి, చి త్తూరు జిల్లాలోని కుప్పం, కర్నూ లు జిల్లాలోని బేతంచర్ల, కడప జిల్లా లోని కమలాపురం, రాజం పేట, అనంతపురం జిల్లాలోని పెను కొం డ పురపాలక సంఘాల్లో పోలిం గ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచిం చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement