Sunday, April 28, 2024

AP | ఇంధన పోదుపు ఉద్యమంలో పాఠశాల విద్యార్థులు.. 150కి పైగా మోడల్‌ స్కూల్స్‌లో ఎనర్జీ క్లబ్బుల ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ : పాఠశాల విద్యార్థులకు విద్యుత్‌ పొదుపు, ఇంధన వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఎనర్జీ క్లబ్‌లను ఏర్పాటు- చేస్తోంది. విద్యా శాఖ సహకారంతో ఇప్పటికే 150 పైగా మోడల్‌ పాఠశాలల్లో ఈ ఎనర్జీ క్లబ్‌లను ఏర్పాటు- చేసింది. విద్యుత్‌ పొదుపు, సహజ ఇంధన వనరుల పరిరక్షణలో విద్యార్థులను, భవిష్యత్‌ తరాలను భాగస్వాములను చేయటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు- కోసం మొదటి దశలో మోడల్‌ స్కూళ్లను ఎంపిక చేశారు. ఎనర్జీ క్లబ్‌లో చేరిన విద్యార్థులకు విద్యుత్‌, ఇతర సహజ ఇంధన వనరులపై అవగాహన కల్పిస్తారు. ఇందు కోసం వ్యాస రచన పోటీలు, స్లోగన్‌ కాంపిటీ-షన్‌, షార్ట్‌ వీడియో కాంపిటీషన్‌ వంటివి నిర్వహిస్తారు.

ఈ కార్యకక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను ఏపీఎస్‌ఈసీఎం ఆయా పాఠశాలలకు అందచేస్తుంది. సదరు పాఠశాల ప్రధానోపాద్యాయులు, టీ-చర్లు ఈకార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటట్లు- చూడడమేగాక వివరాలను స్నేహితులు, కుటు-ంబ సభ్యులు, ఇరుగుపొరుగువారితో పంచుకుని అవగాహ కల్పించేలా వారికి తగిన మార్గదర్శకం చేస్తారు. మలిదశలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పాఠశాలలో విస్తరించాలని ఏపీఎస్‌ఈసీఎం భావిస్తోంది.

ఇంధన పొదుపై వినూత్న కార్యక్రమాలు..

- Advertisement -

విద్యుత్‌ పొదుపు, విద్యుత్‌ సమర్ధ వినియోగంపై పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని వినూత్న కార్యక్రమాలనుచేపట్టాల్సిందిగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ ఏపీఎస్‌ఈసీఎంకు సూచించారు. రాష్ట్రంలో ఇంధన భద్రత సాధించడం, 24/7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయటానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ లక్ష్యాల సాధనలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి గృహంలో విద్యుత్‌ పొదుపు, ఇంధన సమర్ధ వినియోగంపై అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎనర్జీ క్లబ్‌ల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న పాఠశాల విద్యా శాఖ కమీషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ , ఏపీ మోడల్‌ స్కూల్‌ సెక్రటరీ కే రవీంద్రనాథ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు- ఏపీఎస్‌ఈసీఎం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement