Monday, April 29, 2024

Narasaraopet : స్కూలు బస్సు బోల్తా.. 15మంది విద్యార్థులకు గాయాలు

స్కూలు బస్సు బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న 15మంది విద్యార్థులకు గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. స్కూలు బస్సు కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement