Thursday, May 2, 2024

నేత్రపర్వంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తెప్పపై విహ‌రించిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధ‌వారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్ప‌స్వామి తెప్పపై విహ‌రించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది. కార్యక్రమంలో టీటీడీ చిన‌జీయర్‌స్వామి, విజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement