Thursday, April 25, 2024

రైల్వేలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ, ఎంపీ నామా ప్రశ్నకు కేంద్రం బదులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రైల్వే శాఖలో ఏర్పడిన ఖాళీలను జోన్ల‌వారీగా ఎప్పటికప్పుడు భ‌ర్తీ చేస్తుంటామ‌ని కేంద్రం స్పష్టం చేసింది. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా భార‌తీయ రైల్వేలో ఎన్ని నియామ‌కాలు చేపట్టారు. ఎన్ని రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లు నిర్వహించార‌ని బుధవారం ఖ‌మ్మం పార్లమెంట్ స‌భ్యులు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు లిఖిత‌పూర్వకంగా స‌మాధానమిచ్చారు. ఈ వివరాల‌న్నీ తాము గతంలోనే పార్లమెంట్‌కు స‌మ‌ర్పించామ‌ని, ఖాళీల ఆధారంగా త‌ర‌చూ నియామ‌కాలు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా స‌మ‌యమంటూ లేద‌ని, నియామ‌క ప్రక్రియ‌లో భాగంగా వెల్లడిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement