Sunday, April 28, 2024

Jaganను కాదని ఎవరు ఏమీ చేయలేరు – మంత్రి రోజా

మంగళగిరి డిసెంబర్ 26 ప్రభ న్యూస్-*జగన్ ను కాదని ఎవరూ ఏమీ చేయలేరని క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. మంగళవారం మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా పై స్పందించారు బలమైన సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

గతంలో వైసిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమైందో చూశాం కదా అని అన్నారు. తనకు నగరి నుంచి మళ్లీ పోటీ చేసేందుకు టికెట్ వస్తుందని అనుకుంటున్నానని ఒకవేళ రాకపోయినా సమతమేనని తెలిపారు ఒకసారి ఎమ్మెల్యేగా చేయాలని అనుకున్నానని రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

మంత్రి రోజాకు అంగన్వాడీల నిరసన సెగ

తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన అంగన్వాడి కార్యకర్తలను మంత్రి రోజా సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేశారు దీంతో రోజా తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దేవస్థానం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement