Monday, April 29, 2024

Roja Counter – చంద్ర‌బాటు ఆట‌లో ప‌వ‌న్ ఆర‌టి పండు – రోజా

అమరావతి: చంద్ర‌బాబు ఆటలో అరటి పండు లాంటి పవన్ క‌ల్యాణ్ ముఖ్య‌మంత్రి జగన్ ను ఓ ఆట‌ ఆడిస్తాడా అని ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ,. వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్టణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ, జ‌గ‌న్ పై ఎవ‌రికైనా ఫిర్యాదు చేసుకోవ‌చ్చ‌ని, తాము దేనికి భ‌య‌ప‌డ‌బోమ‌ని అన్నారు.. .

చంద్రబాబు అరవమంటే అరుస్తాడు, కరవమంటే కరుస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ కు ఓ జెండా ఎజెండా లేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే పవన్ అని ఆమె వ్యాఖ్యానించారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తామే అధికార ప‌క్షం, తామే ప్ర‌తిప‌క్ష‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు రోజా..నిజంగా . చంద్రబాబు సింహాం అయితే వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement