Monday, April 29, 2024

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. మడకశిర ఎమ్మెల్యే కారు గుద్ద‌డంతో ఒక‌రు మృతి

మడకశిర, ప్రభన్యూస్‌: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబందించిన వివరాలిలావున్నాయి.. ఎమ్మెల్యే తిప్పేస్వామికి చెందిన కారు టీ-ఎస్‌9 ఫఫ్‌ ఎల్‌ 9212 నెంబరు కల కారు చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్య కర్ణాటక రాష్ట్రంలో ముళబాగిల్‌ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్‌ తునాతునకలయ్యింది . ట్రాక్టర్‌ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం( 35 ) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే డ్రైవర్‌ పరారైనల్లు తెలిసింది. అయితే ఆ కారులో ఎమ్మెల్యేతో పాటు డ్రైవర్‌ కూడా ప్రయాణిస్తున్నట్లు ముళ్ళబాగిల్‌ కాంతరాజు సర్కిల్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రయాణించే సందర్భంలో ప్రమాదం అనంతరం చికిత్సకొరకు ఆసుపత్రి వెళ్లారా లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే లేడని వేరే ప్రాంతంలో క్షేమంగా ఉన్నారని రాత్రికి మడకశిర చేరుకుంటారని ఆయన సన్నిహితులు వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement