Sunday, May 5, 2024

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Chittoor district) జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట (Reniguta) మండలం కుక్కలదొడ్డి వద్ద గురువారం జరిగింది. రేణిగుంట నుండి రైల్వేకోడూరు వైపు వెళ్తున్న కారు.. లారీని ఓవర్టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారిని కడప జిల్లా (Kadapa Residents) వాసులుగా గుర్తించారు. రాజంపేట మండలం చెర్లోపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మయ్య (40), నరసమ్మ(60)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement