Tuesday, April 30, 2024

MLC : డివైడర్​ను ఢీకొన్న ఎమ్మెల్సీ కారు… స్పాట్​లో పీఏ డెడ్​…

ఏపీకి చెందిన టీచర్స్‌ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా మార్గం మధ్యలో దగదర్తి వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టింది . ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలించారు. అదేమార్గంలో వెళ్తున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కారు ప్రమాదాన్ని గమనించి.. ఎమ్మెల్సీని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement