Sunday, May 5, 2024

AP | కృష్ణా న‌దికి పెరుగుతున్న వరద.. బ్యారేజీకి పెద్దఎత్తున చేరుతున్న నీరు

ఎన్టీఆర్ బ్యూరో, (ప్రభ న్యూస్) : ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు, కృష్ణ ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటితో గంట గంటకు నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గత రాత్రి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లో 12 వేల క్యూసెక్కులు కాగా బుధవారం ఉదయం 8 గంటలకి ఆ ప్రవాహం 37వేల క్యూసెక్కులకు చేరుకుంది.

నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగుల మేర నీటి నిల్వను ఉంచుతూ 50 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 37 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణ దిగువ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement