Monday, April 29, 2024

Machiliptnam – ప్రముఖ వైద్యుని భార్య దారుణ హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుని భార్య దారుణ హత్యకు గురయ్యారు. జవ్వారుపేటకు చెందిన పిల్లల వైద్యుడు డా. ఉమామహేశ్వరరావు భార్య రాధాను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం హత్య చేశారు.హత్య చేసిన తర్వాత ఆమె వంటిపై ఉన్న బంగారపు అభరణాలను తస్కరించి పరారయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement