Sunday, April 28, 2024

KA Paul: పోలింగ్ రోజునే రిజల్ట్స్.. కేఏ పాల్ అభ్యర్థన

పోలింగ్‌ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సీఈసీని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ రాజీవ్‌కుమార్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కలిశారు. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధులను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరానన్నారు. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని చెప్పినట్లు ఆయన తెలిపారు.

కాపు సోదరులు మేల్కొని, రంగాను చంపిన పార్టీ వెంట వెళ్లకండి అంటూ సూచించారు. తనపై విషప్రయోగం జరిగిందని.. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేఏ పాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement