Monday, April 29, 2024

అమలాపురంలో మళ్ళీ రెడ్ జోన్

దేశంలో కరోనా మహమ్మారి మల్లి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనితో ప్రజలంతా మళ్ళీ భయాందోళనకు గురవుతున్నారు. తాజా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అమలాపురం హైస్కూల్ సెంటర్ లోని ఒక మెడికల్ షాప్ యజమాని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రాగా భూపయ్య అగ్రహారంలో హైదరాబాద్ నుండి వచ్చిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

దీనితో ఆ ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement