Sunday, April 28, 2024

AP: కోలుకున్న పవన్.. 7నుంచి మళ్లీ వారాహి విజయ భేరీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో ‘వారాహి విజయ భేరీ’ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ చేపట్టారు. అయితే ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో తాత్కాలికంగా యాత్రకు విరామం ఇచ్చారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ‘వారాహి విజయ భేరీ’ యాత్రను కొనసాగించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 7న అనకాపల్లిలో సభ నిర్వహించనున్నారు. 8న యలమంచిలిలో యాత్ర కొనసాగిస్తారు. ఈ 9న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement