Friday, May 3, 2024

జ‌న‌సేన అధికార ప్ర‌తినిధిగా రాయ‌పాటి అరుణ

జ‌న‌సేన పార్టీలో మ‌రో కీల‌క నియామ‌కం జ‌రిగింది. పార్టీ అధికార ప్ర‌తినిధిగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన రాయ‌పాటి అరుణ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా పార్టీ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పార్టీ విధానాల‌ను జ‌నాల్లో తీసుకెళ్లడంతో పాటుగా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం, విమ‌ర్శ‌ల‌ను దీటుగా ఎదుర్కొనే అరుణ తీరును ప‌రిశీలించిన ప‌వ‌న్ ఆమెను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాయ‌పాటి అరుణ ప్ర‌కాశం జిల్లా ఒంగోలు న‌గ‌రానికి చెందినవారు. ప్ర‌స్తుతం పార్టీ ప్ర‌కాశం జిల్లా క‌మిటీలో సంయుక్త కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. సాధార‌ణ కుటుంబానికి చెందిన ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న‌ట్లు పార్టీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement