Sunday, April 28, 2024

GVL: ఏపీలో బీజేపీ-జనసేనలదే అధికారం.. వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం

ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి అడుగులు వేస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని చెప్పారు. 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ సమావేశమై బలమైన రాజకీయ వ్యూహాలను తయారు చేస్తామని తెలిపారు. రాయలసీమ సమస్యలకు సంబంధించి కడపలో రేపు రణభేరిని నిర్వహించనున్నట్టు జీవీఎల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement