Thursday, May 2, 2024

AP: మార్కాపురంలో వైభవంగా ప్రారంభమైన రథ‌సప్తమి ఉత్సవాలు

పశ్చిమ ప్రకాశం ప్రతినిధి, ప్ర‌భ‌న్యూస్ః ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనం పై పట్టణం లోని నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందుగా దర్శనం ఇస్తున్నారు స్వామి వారు.

- Advertisement -

ఈ వేడుకలలో మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డీ, అన్నా రాంబాబులు ఉత్సవ సేవలలో పాల్గొన్నారు. సూర్యప్రభ వాహనం వెంట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement