Thursday, May 16, 2024

రామ‌కృష్ణ‌ హౌస్ అరెస్ట్ దుర్మార్గం – జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించక పోవడాన్ని ఆయన తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జమ్ము-కశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్‌చౌక్ వంటి సమస్యాత్మక ప్రాంతంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగరేసామని, కానీ గుంటూరులోని ‘జిన్నా టవర్’పై ఎగరేయడానికి అనుమతించలేదని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో ముస్లింలకు దేశభక్తి తక్కువా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement