Monday, April 29, 2024

AP : టిడిపి నేత చంద్ర‌బాబు కు రాజ‌యోగం..టిడిపి కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు జ‌రిగిన ఉగాది వేడుక‌ల‌లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ఉగాది పచ్చడి అందించి ఆశీర్వదించారు వేద పండితులు. అనంతరం పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్.. పంచాంగ శ్రవణం చేస్తూ.. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. పొత్తులతో ఏం జరగబోతోంది లాంటి విషయాలను కూడా వెల్లడించారు..

టిడిపి అధినేత‌ చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని తెలిపారు.. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్న ఆయన.. త్రిమూర్తులు కలయికతో ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరుగుతోందన్నారు.. బ్రహ్మ – నరేంద్ర మోడీ, విష్ణువు – పవన్ కల్యాణ్‌, ఈశ్వరుడు – చంద్రబాబు.. ఇలా త్రిమూర్తులుగా అభివర్ణించారు..

- Advertisement -

ఇక, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించనున్నట్టు పేర్కొన్నారు.. చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణం చేపడతారని తెలిపారు. టీడీపీది వృశ్చిక రాశి.. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారని వెల్లడించారు మాచిరాజు వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు.. వర్ల రామయ్య తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement