Thursday, May 16, 2024

AP | 28న విజయవాడకు రజనీకాంత్ రాక‌.. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరు

అమరావతి, ఆంధ్రప్రభ: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ నెల 28న విజయవాడకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానం పంపింది. శత జయంతి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకం తీసుకున్న టీడీపీ రజనీకాంత్‌తో పాటు మరికొందరు సినిమా స్టార్లను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 28వ తేదీన పొరంకిలో జరగనున్న కార్యక్రమంలో రజనీకాంత్‌ పాల్గొననున్నారు. కార్యక్రమం లో రజనీ కాంత్‌ తో పాటు బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. ఈ ఏడాది అంతా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన టీడీపీ అనేక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement