Tuesday, April 30, 2024

Chilakaluripet – వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మల్లెల రాజేష్

చిలకలూరిపేట, ప్రభ న్యూస్ – 2024 జరగబోయే ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసిపి అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు పోటీ చేస్తారని రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి సోమవారం ప్రకటించారు. సోమవారం జరగబోయే సామాజిక సాధికార యాత్ర లో పాల్గొనేందుకు చిలకలూరిపేట లోని కొత్త మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

చిలకలూరిపేట ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రతినిధిగా చిలకలూరిపేట నుంచి రాజేష్ నాయుడు పోటీ చేస్తారని తెలిపారు. చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మల్లెల రాజేష్ కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తున్న వైసిపికి ప్రజలందరూ మరోసారి పట్టం కట్టాలని కోరారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement