Sunday, April 28, 2024

నెల్లూరు జిల్లాలో రాజస్థాన్ డ్రైవర్ మృతి.. అస‌లు కార‌ణం ఏంటంటే..

ముత్తుకూరు (ప్రభ న్యూస్) : నెల్లూరు జిల్లాలో రాజ‌స్థాన్‌కు చెందిన ఓ లారీ డ్రైవ‌ర్ చ‌నిపోయాడు. అత‌ని మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ముత్తుకూరు ఎస్సై శివ‌కృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజస్థాన్ రాష్ట్రం ఆల్వార్ ప్రాంతానికి చెందిన ముఖేష్ కుమార్ రాందాస్ (35) డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పంటపాలెంలోని కార్గిల్ ఆయిల్ ఫ్యాక్టరీకి సమీపంలోని పోర్ట్ రోడ్డు వద్ద చ‌నిపోయాడు.

ఢిల్లీలోని అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 20వ తేదీన ఢిల్లీ నుంచి పార్శిల్ లోడ్ తో లారీని తీసుకుని బ‌య‌లుదేరాడు. ఈ నేపథ్యంలో చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని జిందాల్ కంపెనీలో పార్శిల్‌ను అన్‌లోడ్ చేయాల్సి ఉంది. పోర్టు రోడ్డు వద్ద ఫిట్స్‌తో బాధపడుతూ ఉండగా స్థానికులు అత‌డిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement