Thursday, May 2, 2024

రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య కన్నుమూత

రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందారు. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు… నేడు ఆమె పరిస్థితి విషమిచడంతో కన్నుమూసారు..

కాగా , విశాఖపట్నం కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారిగా పనిచేస్తున్న ఎస్‌.రాహుల్‌ను సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అయన ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరం వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

భార్యకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. .ఒకవైపు భార్యకు అనారోగ్యం, మరోవైపు అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వర్తించడం, ఈలోపు చంద్రబాబు అంశం వల్ల ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది. ఇదే సమయంలో భార్య పరిస్థితి విషమించడంతో అయన సెలవులో రిలీవ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement